వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సైకిల్ ర్యాలీలో తెరాస కార్యకర్త మృతి
కరీంనగర్: కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) గురువారం చేపట్టిన సైకిల్ ర్యాలీలో పార్టీ కార్యకర్త ఒకరు ప్రమాదవశాత్తు మరణించాడు. స్కూటర్పై నుంచి పడి నారాయణ అనే కార్యకర్త మరణించాడు. మృతుని కుటుంబానికి తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు లక్ష రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తక్షణ సహాయంగా ఐదు వేల రూపాయలు అందజేశారు.
కరీంనగర్ లోక్సభ ఉప ఎన్నిక దృష్ట్యా పార్టీ ప్రచారాన్ని ఉధృతం చేసింది. ఈ సందర్భంగా తెరాస గురువారంనాడు తెరాస సైకిల్ ర్యాలీ చేపట్టింది.
Comments
Story first published: Thursday, October 26, 2006, 23:53 [IST]