వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వివాహిత కిడ్నాప్: రూ. 50 లక్షలు డిమాండ్
విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడలోని గుణదలలో ఒక వివాహిత గురువారంనాడు కిడ్నాప్నకు గురైంది. అభియన అనే 24 ఏళ్ల మహిళ నాగుల పంచమి సందర్భంగా విశ్వేశ్వరాలయానికి పూజల నిమిత్తం వెళ్లింది. అయితే తిరిగి రాలేదు. ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆగంతకులు ఆమె భర్త క్రాంతికుమార్కు ఫోన్ చేసి చెప్పారు.
ఆమె విడుదలకు కిడ్నాపర్లు 50 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. ఫోన్ ద్వారా కిడ్నాపర్లు తమ డిమాండ్ను తెలియజేశారు. కిడ్నాపర్లు గుంటూరు జిల్లా తెనాలికి చెందినవారు అయి వుండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కిడ్నాపర్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
Comments
Story first published: Thursday, October 26, 2006, 23:53 [IST]