వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హీరో చిరంజీవికి గౌరవ డాక్టరేట్
విశాఖపట్నం: హీరో చిరంజీవికి ఆంధ్రా యూనివర్సిటీ నవంబర్ 6న గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేయనుంది. ఈ సంవత్సరమే పద్మభూషణ్ అవార్డు ఆయనకు లభించింది. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ ఆయనకు చాలాకాలం క్రితమే రావలసి ఉన్నా, రకరకాల కారణాల వల్ల ఆ పురస్కారం ఆయనకు లభించలేదు. ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ రంగరాజన్, డిఆర్డివో చీఫ్ శివథాను పిళ్ళేకి కూడా గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేయనున్నట్టు ఆంధ్రా యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలియజేసింది. కళారంగానికి సేవలు అందించడంతో పాటు సామాజిక సేవాకార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నందువల్ల చిరంజీవికి ఈ పురస్కారం లభించనుంది.
Comments
Story first published: Saturday, October 28, 2006, 23:53 [IST]