వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భారతీయ డ్రమ్మర్స్కు గిన్నిస్ బుక్లో స్ధానం
షిల్లాంగ్: డ్రమ్ వాద్యకారుల ప్రతిభతో మేఘాలయ హోరెత్తింది. షిల్లాంగ్లో మేఘాలయ టూరిజం అభివృద్ధి సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో 7,951మంది డ్రమ్మర్స్ పాల్గొని ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఒకేచోట 7,951 మంది డ్రమ్ వాద్యకారులు గుమికూడి ప్రతిభా పాటవాలు ప్రదర్శించడం ఇదే ప్రధమం. ఈ విధంగా మేఘాలయ డమ్మర్స్ తమ డ్రమ్వాద్యంతో హోరు సృష్టించి ఏకంగా గిన్నిస్బుక్ లో స్థానం సంపాదించారు. 2008 గిన్నిస్బుక్లో మేఘాలయ డ్రమ్మర్స్ ప్రతిభకు స్థానం లభిస్తుంది. గతంలో అంటే 2005 ఫిబ్రవరిలో హాంగ్కాంగ్లోజరిగిన ఓ కార్యక్రమంలో 7,725 మంది డ్రమ్మర్స్ ఒకేసారి తమ వాద్యాలతో హోరెత్తించారు. ఆ రికార్డును షిల్లాంగ్ డ్రమ్మర్స్ అధిగమించారు.
Comments
Story first published: Sunday, October 29, 2006, 23:53 [IST]