వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతోంది. ప్రస్తుతం నెల్లూరుకు 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావం వల్ల రానున్న 24 గంటల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే విశాఖ ఓడరేవువద్ద మూడో ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. వాయుగుండం ప్రభావం వల్ల ఇప్పటికే రాష్ట్రంలో ఒక మాదిరి నుంచి విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఒంగోలు భారీ వర్షాలవల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్ళలోకి నీరు వచ్చి ప్రజలు ఇక్కట్లపాలయ్యారు. ఒంగోలు, కావలి, కాకినాడ, మచిలీపట్నం, బాపట్లలో విస్తృతంగా వర్షాలు కురిశాయి.
Comments
Story first published: Sunday, October 29, 2006, 23:53 [IST]