వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి క్రాస్ రోడ్డు వద్ద సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఎదురుగా వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. లారీ తప్పిదంవల్లనే ఈ ప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు.
మృతులను రాజశేఖర్, గణేష్, అంజాద్ఖాన్, కాంతయ్యలుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కూడా గాయపడ్డాడు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Story first published: Tuesday, October 31, 2006, 23:53 [IST]