వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వరంగల్ జిల్లాలో మహిళా నక్సల్ హతం
వరంగల్: వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం నాగులాపూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు దళ సభ్యురాలు సులోచన మరణించింది. సంఘటనా స్థలం నుంచి రెండు ఆయుధాలను, 8 కిట్ బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్లో మరణించిన సులోచన వరంగల్ జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిందని సమాచారం.
పోలీసుల కథనం ప్రకారం - పక్కా సమాచారం మేరకు సోమవారం సాయంత్రం పోలీసులు మావోయిస్టుల కోసం గాలింపుప చర్యలు చేపట్టారు. ఈ సమయంలో పోలీసులకు మావోయిస్టులు ఎదురయ్యారు. పోలీసులను చూసిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎదురుకాల్పుల్లో ఒక మహిళా నక్సలైట్ గాయపడినట్లు భావించారు. అయితే మంగళవారం చూడగా మహిళా నక్సలైట్ మరణించినట్లు గుర్తించారు.
Comments
Story first published: Tuesday, October 31, 2006, 23:53 [IST]