వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరంగల్‌ జిల్లాలో మహిళా నక్సల్‌ హతం

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌: వరంగల్‌ జిల్లా తాడ్వాయి మండలం నాగులాపూర్‌ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు దళ సభ్యురాలు సులోచన మరణించింది. సంఘటనా స్థలం నుంచి రెండు ఆయుధాలను, 8 కిట్‌ బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన సులోచన వరంగల్‌ జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిందని సమాచారం.

పోలీసుల కథనం ప్రకారం - పక్కా సమాచారం మేరకు సోమవారం సాయంత్రం పోలీసులు మావోయిస్టుల కోసం గాలింపుప చర్యలు చేపట్టారు. ఈ సమయంలో పోలీసులకు మావోయిస్టులు ఎదురయ్యారు. పోలీసులను చూసిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎదురుకాల్పుల్లో ఒక మహిళా నక్సలైట్‌ గాయపడినట్లు భావించారు. అయితే మంగళవారం చూడగా మహిళా నక్సలైట్‌ మరణించినట్లు గుర్తించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X