వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హరితాంధ్రప్రదేశ్ మా లక్ష్యం: ముఖ్యమంత్రి
హైదరాబాద్: ఇందిరమ్మ పథకాలను పకడ్బందీగా అమలు చేసి రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ స్వర్ణోత్సవాల సందర్భంగా బుధవారం చేసిన ప్రసంగంలో ఆయన ఆ హామీ ఇచ్చారు. పోలీసు వందనం స్వీకరించారు. పోలీసులకు విశిష్ట సేవాపతకాలను ప్రదానం చేశారు. అభివృద్ధి, సుపరిపాలన తమ ప్రభుత్వ లక్ష్యాలని ఆయన చెప్పారు.
ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు నుంచి, ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసిన బూర్గుల రామకృష్ణారావు వరకు అందరినీ తాను ఈ సందర్భంగా స్మరిస్తున్నానని ఆయన చెప్పారు. వారి త్యాగాలు అర్థవంతం కావడానికి, వారి కలలను సాకారం చేయడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన చెప్పారు.
Comments
Story first published: Wednesday, November 1, 2006, 23:53 [IST]