వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కరీంనగర్ లోక్సభ టిడిపి అభ్యర్థిగా రమణ
హైదరాబాద్: కరీంనగర్ లోక్సభ సీటుకు తమ పార్టీ అభ్యర్థిగా ఎల్. రమణ పేరును తెలుగుదేశం పార్టీ పోలిట్బ్యూర్ బుధవారంనాడు అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి మోసాలను ఈ ఎన్నికలో ఎండగడుతామని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధితో సమగ్రాభివృద్ధే తమ లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తామని ఎల్. రమణ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వ హయాంలో పెద్ద పీట వేశామని, అదే తమను గెలిపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆకలి చావులు కరీంనగర్లోనే ఎక్కువగా జరిగాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. కరీంనగర్ లోక్సభ ఎన్నికల్లో తాము గెలిచి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Comments
Story first published: Wednesday, November 1, 2006, 23:53 [IST]