వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పోలీసు సంస్కరణలపై జానారెడ్డి సమీక్ష
హైదరాబాద్: పోలీసు శాఖలో సంస్కరణలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) స్వరణ్జిత్ సేన్ అన్నారు. పోలీసు శాఖలో సంస్కరణలపై హోం మంత్రి కె. జానారెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమీక్ష అనంతరం డిజిపి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు మార్గదర్శక సూత్రాలపై చర్చలు జరిపామని ఆయన చెప్పారు.
సమీక్షా సమావేశం చాలా బాగా జరిగిందని ఆయన చెప్పారు. అయితే సమావేశంలో ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. సమావేశంలో అధికారులు అభిప్రాయాలను మాత్రమే అడిగి తెలుసుకున్నామని ఆయన చెప్పారు.
Comments
Story first published: Thursday, November 2, 2006, 23:53 [IST]