వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అదనపు విద్యుత్కు షిండేకు అనుకూలం: షబ్బీర్
న్యూఢిల్లీ: రాష్ట్రానికి అదనపు విద్యుత్తును ఇవ్వడానికి కేంద్ర ఇంధన శాఖ మంత్రి సుశీల్కుమార్ షిండే సానుకూలంగా ప్రతిస్పందించారని రాష్ట్ర విద్యుచ్ఛక్తి మంత్రి షబ్బీర్ అలీ చెప్పారు. సుశీల్ కుమార్ షిండేతో ఆయన గురువారంనాడు ఢిల్లీలో సమావేశమైన రాష్ట్రానికి అదనపు విద్యుత్ కావాలని కోరారు. తమకు దాదాపు 500 మెగావాట్ల విద్యుత్ అవసరం పడుతుందని చెప్పినట్లు ఆయన తెలిపారు.
కేటాయించిన విద్యుత్ను సరఫరా చేస్తామని షిండే హామీ ఇచ్చినట్లు షబ్బీర్ తెలిపారు. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై నెలకు అదనంగా 173 కోట్ల రూపాయల భారం పడుతుందని, ఈ భారం వచ్చే నాలుగైదు మాసాల వరకు భరించాల్సి వుంటుందని ఆయన చెప్పారు. రైతుల ప్రభుత్వం కాబట్టి ఆ భారాన్ని భరించడానికి ప్రభుత్వం సిద్ధపడిందని ఆయన చెప్పారు.
Story first published: Thursday, November 2, 2006, 23:53 [IST]