వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రకాశం: ప్రభుత్వ ఉప్మా తిని 39 మందికి అస్వస్ధత

By Staff
|
Google Oneindia TeluguNews

ఒంగోలు: ప్రకాశం జిల్లా బుర్లవారి పాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరంలోని వారికి శనివారం ఉదయం సరఫరా చేసిన ఆహారం విషాహారంగా మారడంతో 34మంది అస్వస్థతపాలయ్యారు. ఎక్కడో వండి శుక్రవారం రాత్రి శిబిరానికి ఉప్మా తీసుకువచ్చారు. రాత్రి 11 గంటలు కావడంతో అదే ఉప్మా ఉదయం సరఫరా చేశారు. ఉప్మా తిన్న వెంటనే దాదాపు 27 మంది వెంటనే వాంతులు చేసుకున్నారు. దీంతో కంగారు పడిన అధికారులు మిగతా ఉప్మా సరఫరా నిలిపివేసి, బాధితులను చీరాల ఆసుపత్రికి తరలించారు. వారిలో చాలామంది కోలుకున్నారని అధికారులు తెలిపారు. కాగా ఇదే జిల్లాలో మరో చోట ఏర్పాటు చేసిన పునరావాస శిబిరంలో ఉప్మా తిన్న ఐదుగురు తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X