వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రకాశం: ప్రభుత్వ ఉప్మా తిని 39 మందికి అస్వస్ధత
ఒంగోలు: ప్రకాశం జిల్లా బుర్లవారి పాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరంలోని వారికి శనివారం ఉదయం సరఫరా చేసిన ఆహారం విషాహారంగా మారడంతో 34మంది అస్వస్థతపాలయ్యారు. ఎక్కడో వండి శుక్రవారం రాత్రి శిబిరానికి ఉప్మా తీసుకువచ్చారు. రాత్రి 11 గంటలు కావడంతో అదే ఉప్మా ఉదయం సరఫరా చేశారు. ఉప్మా తిన్న వెంటనే దాదాపు 27 మంది వెంటనే వాంతులు చేసుకున్నారు. దీంతో కంగారు పడిన అధికారులు మిగతా ఉప్మా సరఫరా నిలిపివేసి, బాధితులను చీరాల ఆసుపత్రికి తరలించారు. వారిలో చాలామంది కోలుకున్నారని అధికారులు తెలిపారు. కాగా ఇదే జిల్లాలో మరో చోట ఏర్పాటు చేసిన పునరావాస శిబిరంలో ఉప్మా తిన్న ఐదుగురు తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు.
Story first published: Saturday, November 4, 2006, 23:53 [IST]