వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖ స్టీల్‌సిటీ ప్రమాద మృతులు 9

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖ పట్నం: విశాఖ నగరంలో నిర్మాణంలో ఉన్న స్టీల్‌సిటీ గానసభ స్లాబ్‌ కూలిన ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. ఆరుగురు అక్కడికక్కడే చ నిపోగా, గాయపడిన పదిమందిని విశాఖ కింగ్‌ జార్జి ఆస్పత్రిలో చేర్చారు. వారిలో ముగ్గురు తెల్లవారుజామున మరణించారు. గానసభ వేదిక కాలమ్స్‌ పని పూర్తిచేసి బయటకు వస్తున్న సమయంలో వర్షం పడడంతో వీరంతా వేదిక కిందకు చేర్చారు. వేదిక స్లాబ్‌ హఠాత్‌గా కూలడంతో దుర్ఘటన జరిగింది. మరణించిన వారిలో ముగ్గురు మహిళలు, ఒక బాలుడు ఉన్నారు. ప్రమాదంలో మరణించిన వారికి లక్ష రూపాయల నష్టపరిహారం ఇవ్వడానికి స్టీల్‌ సిటీ యాజమాన్యం ముందుకు రాగా, 5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని అఖిల పక్షం డిమాండ్‌ చేస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X