వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కబ్జా రుజువైతే ఏ శిక్షకైనా సిద్ధం: కిరణ్‌కుమార్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో తాను భూకబ్జాకు పాల్పడినట్లు రుజువైతే ఏ శిక్షకైనా సిద్ధమని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కిరణ్‌కుమర్‌ రెడ్డి సవాల్‌ చేశారు. తాను బంజారాహిల్స్‌లో 700 గజాల భూమిని కబ్జా చేసినట్లు వచ్చిన వార్తలపై ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ప్రతిస్పందించారు. ఈ ఆరోపణపై విచారణ జరిపించాలని కోరుతూ ఆయన ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర రెడ్డికి ఒక లేఖ రాశారు. ఈ విచారణలో తన దోషిత్యం రుజువైతే ఏ శిక్షకైనా సిద్ధమని ఆయన అన్నారు. బంజారాహిల్స్‌లోని భూమి విషయంలో తాను ఏ తప్పు చేయలేదని ఆయన స్పష్టం చేశారు.

తాను నిజానికి 835 గజాల పైచిలుకు భూమికి దరఖాస్తు చేసుకున్నానని, అందుకు ఈ ఏడాది జులై 12వ తేదీన 3 లక్షల 76 వేల 260 రూపాయలకు చెక్‌ కూడా రాసిచ్చానని ఆయన వివరించారు. దానికి సంబంధించిన రిసీట్‌ కూడా తన వద్ద వుందని ఆయన చెప్పారు. భూమి కేటాయింపునకు జరిగిన సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఉన్నారని, భూమిని తక్కువ ధరకు ఇస్తున్నారు కాబట్టి వివాదం చెలరేగుతుందేమోనని తాను అన్నానని, అయితే డబ్బులిచ్చి తీసుకుంటున్నప్పుడు తప్పేముందని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారని, అయితే వీటిని మినిట్స్‌లో రాయలేదని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X