వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కిరణ్ది పక్కా అక్రమ కబ్జానే: మైసురారెడ్డి
హైదరాబాద్: ప్రభుత్వ చీఫ్ విప్ కిరణ్కుమార్ రెడ్డి తీరు శకునం చెప్పే బల్లి కుడితిలో పడినట్లుందని తెలుగుదేశం నాయకుడు డాక్టర్ ఎం.వి. మైసురారెడ్డి వ్యాఖ్యానించారు. కిరణ్కుమార్రెడ్డిది పక్కా అక్రమ భూకబ్జానే అని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని భూమిని ఆక్రమించుకున్నారని ఆయన అన్నారు.
కిరణ్కుమార్ రెడ్డి ఆక్రమించుకున్న భూమిని హైదరాబాద్ నగర పాలక సంస్థకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడుతున్న ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా మార్గదర్శకత్వం వహిస్తుందని ఆయన ప్రశ్నించారు.
Comments
Story first published: Friday, August 5, 2011, 12:33 [IST]