వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పూర్తిగా కోలుకున్న శాసనసభ్యుడు వేదవ్యాస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడ: లజ్జబండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మల్లేశ్వరం శాసనసభ్యుడు వేదవ్యాస్‌ పూర్తిగా కోలుకున్నారు. ఆయనను ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు కె. కేశవరావు ఆదివారంనాడు పరామర్శించారు. పడవ ప్రమాదంలో మునిగిపోయిన గన్‌మన్‌, పడవ డ్రైవర్ల ఆచూకీ కోసం నేవీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. గజ ఈతగాళ్లు కూడా రంగంలోకి దిగారు. అయితే వారి ఆచూకీ దొరకడం లేదు.

శనివారంనాడు మల్లేశ్వరం ఎమ్మెల్యే బూరగడ్ద వేదవ్యాస్‌ ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన స్వల్ప గాయాలతో బయటపడగా, ఆయన గన్‌మన్‌ ఆచూకీ కన్పించడం లేదు. మల్లేశ్వరం నియోజకవర్గం పరిధిలోని లజ్జబండ డ్రెయిన్‌లో ఈ ప్రమాదం జరిగింది.. పడవ ప్రమాదం జరిగినప్పుడు పెడన ఎండీవో, ఎమ్మార్వో, బాల కార్మిక అధికారి, ఎంపీపీలు పడవలో ప్రయాణిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కృష్ణా జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమైన విషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X