వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఉగ్రవాద దాడిలో పాక్లో 35 మంది సైనికుల మృతి
ఇస్లామాబాద్: ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడిలో పాకిస్థాన్లో 35 మంది సైనికులు మరణించారు. పాకిస్థాన్లోని సైనిక శిక్షణ స్థావరంలపై ఉగ్రవాదులు బుధవారంనాడు ఆత్మాహుతి దాడి జరిపారు. పెషావర్కు వంద కిలోమీటర్ల దూరంలోని దర్గిలో గల సైనిక ప్రాథమిక శిక్షణా కేంద్రంపై ఈ దాడి జరిగింది.
ఈ దాడిలో పలువురు సైనికులు గాయపడ్డారు. మృతుల సంఖ్యను అధికారులు ధృవీకరించారు. అయితే ఈ దాడికి పాల్పడిందనేది ఏ ఉగ్రవాద సంస్థ అనేది తెలియడం లేదు. ఇప్పటి వరకు కూడా ఈ దాడికి పాల్పడింది మేమేనంటూ ప్రకటించుకోలేదు.
Comments
Story first published: Wednesday, November 8, 2006, 23:53 [IST]