వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గోడ కట్టానంతే, తప్పు చేయలేదు: కిరణ్కుమార్
హైదరాబాద్: తాను అక్రమించుకుంటున్న చెబుతున్న హైదరాబాద్లోని బంజారాహిల్స్లోగల ఎమ్మెల్యే కాలనీలోని 700 గజాల భూమి తన పేర రిజిష్టర్ కాలేదని ప్రభుత్వ చీఫ్ విప్ కిరణ్కుమార్ రెడ్డి చెప్పారు. ఈ విషయంతో తాను ఏ తప్పూ చేయలేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.
ఆ ప్రభుత్వ భూమిలో భద్రత కోసం గోడ కట్టడం మినహా తాను ఏ విధమైన నిర్మాణాలూ చేయలేదని ఆయన వివరించారు. ఆ భూమి ఇంకా ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. అయితే ఆ భూమి కోసం తాను సొసైటీకి దరఖాస్తు పెట్టుకున్నానని, డబ్బులు కూడా చెల్లించానని ఆయన చెప్పారు. ఆ భూమిలో తాను కట్టిన గోడను కూల్చేయమంటే తాను కూల్చేస్తానని, లేదంటే ప్రభుత్వం కూల్చుకోవచ్చునని ఆయన అన్నారు.
Comments
Story first published: Thursday, November 9, 2006, 23:53 [IST]