వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎమ్మెల్యేలు, పోలీసులపై దాడులు: సాగర్
ఒంగోలు: అడవుల్లో గాలింపు చర్యలు ఆపకపోతే శాసనసభ్యులపై, పోలీసులపై దాడులు చేస్తామని మావోయిస్టు నల్లమల అటవీ డివిజన్ కార్యదర్శి సాగర్ హెచ్చరించారు. తమ క్యాడర్ నష్టపోయినప్పటికీ, లొంగుబాట్లు జరిగినప్పటికీ తమ సాయుధ పోరాటం కొనసాగుతుందని ఆయన అన్నారు. ఒక దెబ్బకు రెండు దెబ్బలు తీస్తామని కూడా ఆయన ఒక ప్రకటనలో హెచ్చరించారు.
కొందరు వీరులు మరణించినప్పటికీ ఎంతో మంది వీరులు ఉద్యమాన్ని కొనసాగిస్తారని ఆయన అన్నారు. కొన్ని బూటకం ఎన్కౌంటర్లతో, లొంగుబాట్లతో ఉద్యమాన్ని అణచివేయలేరని ఆయన అన్నారు. పెద్ద యెత్తున బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడుతున్న వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అందుకు మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన అన్నారు.
Comments
Story first published: Thursday, November 9, 2006, 23:53 [IST]