వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బంగాళాఖాతంలో అల్పపీడనం: ఉత్తరాంధ్రలో వర్షాలు
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల ఉత్తర కోస్తా జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. మధ్య పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా వుంది. ఇది మరింత బలపడకపోవచ్చునని వాతావరణ పరిశోధన కార్యాలయం అధికారులు అంటున్నారు. గత రాత్రి విశాఖపట్నంలో కుంభవృష్టి కురిసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు పడుతూనే వున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల వచ్చే 24 గంటల్లో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ పరిశోధన కార్యాలయం అధికారులు చెబుతున్నారు. అల్పపీడనానికి ఈశాన్య రుతుపవవాలు తోడయ్యాయి. రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో కూడా స్వల్పంగా వర్షాలు పడవచ్చునని అంటున్నారు.
Comments
Story first published: Thursday, November 9, 2006, 23:53 [IST]