వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది దుర్మరణం
హైదరాబాద్: రాష్ట్రంలోని శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 9 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం పోడిరెడ్డిపల్లి జంక్షన్ వద్ద సిమెంటు లారీని, జీపు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా వుంది. మృతులందరూ జీపులో ప్రయాణిస్తున్నవారే. వీరు బేస్తవారిపేటకు చెందినవారు.
కాగా మెదక్ జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామ శివారులో మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. వరంగల్ జిల్లా హసన్పర్తి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. గాయపడిన ఒక వ్యక్తి యంజియం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిజామాబాద్ జిల్లాలో వేగంగా వస్తున్న లారీ స్కూటర్ను ఢీకొనడంతో ఒక వ్యక్తి మరణించాడు.
Comments
Story first published: Friday, November 10, 2006, 23:53 [IST]