ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు వ్యతిరేక తీర్పు: బిజెపి
విజయనగరం: వచ్చే బొబ్బిలి, కరీంనగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రాబోతున్నదని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రాధ్యక్షుడు నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. ఉప ఎన్నికల్లో ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గత రెండున్నరేళ్ల కాలంలో నెరవేర్చడంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 4 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసమస్యలను విస్మరించిందని ఆయన విమర్శించారు. ప్రజాసమస్యలకు పరిష్కారం చూపడంలో, కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రాజెక్టులను రాబట్టడంలో ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ఆయన అన్నారు. ఈ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రూజల్లో వ్యతిరేకత పెరుగుతోందని ఆయన అన్నారు.