వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రైతుల ఆత్మహత్యలు తగ్గాయి: వైయస్
కాకినాడ: రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని, నెలకు సగటున పది ఆత్మహత్యలు కూడా జరగడం లేదని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారంనాడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. కాకినాడ సమీపంలో ఒక ఇళ్ల కాలనీకి శంకస్థాపన చేశారు. తమది సంక్షేమ ప్రభుత్వమని ఆయన చెప్పుకున్నారు. రైతుల కోసం తాము చేపట్టిన కార్యక్రమాలే ఆత్మహత్యలు తగ్గడానికి కారణమని ఆయన అన్నారు.
సునామీ బాధితుల కోసం 9 వేల ఇళ్లు నిర్మించిన ఘనత తమదేనని ఆయన చెప్పారు. ఇళ్లు లేని పేదలకు సొంత ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని ఆయన చెప్పారు. వచ్చే రెండేళ్లలో పేదలందరికీ ఇళ్లు నిర్మిస్తామని ఆయన చెప్పారు. స్థానిక మత్స్యకారులతో ఆయన మాట్లాడారు.
Comments
Story first published: Friday, November 10, 2006, 23:53 [IST]