వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చంద్రబాబు విచారణ పూర్తి: జస్టిస్ చలపతి
హైదరాబాద్: కుప్పం ప్రాజెక్టు విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును విచారించడం పూర్తయిందని జస్టిస్ చలపతి చెప్పారు. కుప్పం ప్రాజెక్టుపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం జస్టిస్ చలపతి కమీషన్ను నియమించింది. డిసెంబర్ 31వ తేదీలోగా తమ విచారణను పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.
జస్టిస్ చలపతి కమీషన్ ముందు చంద్రబాబునాయుడు శుక్రవారంనాడు హాజరయ్యారు. దాదాపు రెండు గంటలపాటు ఆయన విచారణ సాగింది. చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేసిన అశోక్గజపతిరాజు, కె. చంద్రశేఖరరావులను కూడా కమీషన్ ఇంతకు ముందు విచారించింది.
Story first published: Friday, November 10, 2006, 23:53 [IST]