వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నంది విజేతలు మహేశ్‌బాబు, త్రిష

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలుగులో ఉత్తమ చిత్రాలకు, నటీనటులకూ, సాంకేతిక నిపుణులకు ఏటా ప్రకటించే ప్రతిష్ఠాత్మక నంది పురస్కారాలకు సంబంధించి 2005 సంవత్సరానికి విజేతలను రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. అతడు చిత్రం అద్భుత నటనను ప్రదర్శించిన మహేశ్‌బాబుకు ఉత్తమ నటుడిగా బంగారు నంది ప్రకటించారు. ఉత్తమ నటిగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో విశేష ప్రతిభ కనబర్చిన త్రిష ఎంపికయ్యారు. వారిద్దరూ జంటగా ప్రస్తుతం సైనికుడు చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.

తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వంలో సాయిబాలాజీ, సింధు తులానీ నటించిన పోతే పోనీ.. ఉత్తమ చిత్రంగా బంగారు నందిని గెలుచుకుంది. ద్వితీయ ఉత్తమ చిత్రంగా ఛార్మి నటించిన అనుకోకుండా ఒక రోజు, తృతీయ ఉత్తమ చిత్రంగా గౌతమ్‌ ఎస్‌ ఎస్‌ సి ఎంపికయ్యాయి.

ఉత్తమ దర్శకుడు కృష్ణవంశీ (చక్రం), ఉత్తమ సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి, ఉత్తమ సహాయ నటుడు శ్రీహరి (నువ్వొస్తానంటే..), ఉత్తమ సహాయ నటి భానుప్రియ (ఛత్రపతి) నంది పురస్కారాలను అందుకోనున్నారు.

నటి స్నేహకు స్పెషల్‌ జ్యూరీ అవార్డును ప్రకటించడం విశేషం. ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఉత్తమ జనాదరణ పొందిన చిత్రంగా పెళ్లాం పిచ్చోడు నిలిచాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X