వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సింగరేణిలో గనిలో 5గురు దుర్మరణం
ఖమ్మం: ఖమ్మం జిల్లా కొత్తగూడెం సింగరేణి ఏడవ గనిలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరొకరు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. గని పైకప్పు కూలిపడడంతో ఈ ప్రమాదం సంభవించింది. మరణించినవారిలో సుధీర్బాబు, రామన్జీ, బుచ్చయ్య, రాంచందర్, దక్షిణాఫ్రికా కంపెనీ ఉద్యోగి థామస్ ఉన్నారు. మరో దక్షిణాఫ్రికా ఉద్యోగి ప్రతాప్కుమార్ శర్మ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. అతని ప్రాణాలను నిలబెట్టేందుకు ఆక్సిజన్, నీరు అందిస్తున్నారు.
గనిలో పైకప్పు శిథిలాలు పేరుకుపోయి వున్నాయి. శవాలను వెలికితీయడం కష్టంగా వుంది. సంఘటనా స్థలానికి కేంద్ర మంత్రి రేణుకాచౌదరి వెళ్లారు. అయితే ఆమెతో పాటు మీడియా ప్రతినిధులను అనుమతించకపోవడాన్ని కార్మిక సంఘాలు తప్పు పడుతున్నాయి. రేణుకా చౌదరితో కార్మిక సంఘాల నాయకులు వివాదానికి దిగారు.
Comments
Story first published: Sunday, November 12, 2006, 23:53 [IST]