వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రింగ్రోడ్డు పనులను పరిశీలించిన న్యాయవాదులు
హైదరాబాద్: హిమాయత్ సాగర్ సమీపంలోని రింగ్ రోడ్డు నిర్మాణ పనులను ఆదివారంనాడు న్యాయవాదుల బృందం పరిశీలించింది. హిమాయత్సాగర్కు 500 మీటర్లలోపు రింగ్ రోడ్డును నిర్మిస్తూ ప్రభుత్వం పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తోందని కొందరు పర్యావరణ వేత్తలు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ప్రతిస్పందిస్తూ హైకోర్టు దాని పరిశీలనకు ఒక అడ్వొకేట్ కమీషన్ను నియమించింది.
ఐదుగురు న్యాయవాదుల బృందం హిమాయత్సాగర్ సమీపంలోని రింగ్ రోడ్డు పనులను పరిశీలించింది. వాస్తవాలను పరిశీలించడానికి ఈ బృందం నడుం కట్టింది.
Comments
Story first published: Sunday, November 12, 2006, 23:53 [IST]