వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ సమక్షంలో కాంగ్రెస్ చేరిన శ్రీహరి
హైదరాబాద్: ప్రముఖ తెలుగు సినీనటుడు శ్రీహరి ఆదివారంనాడు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఫిలిం ఛేంబర్ ఆప్ కామర్స్ అధ్యక్షుడు ఆదిశేషగిరిరావు, ప్రభుత్వ సాంస్కృతిక మండలి అధ్యక్షుడు ధర్మవరపు సుబ్రహ్మణం కూడా ఈ సమయంలో వున్నారు. కాంగ్రెస్ కండువా కప్పి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి శ్రీహరిని పార్టీలోకి ఆహ్వానించారు.
తాను మొదటి నుంచి కాంగ్రెస్వాదినేనని, ఇప్పుడు లాంఛనంగా పార్టీలో చేరానని శ్రీహరి మీడియా ప్రతినిధులతో చెప్పారు. తాను పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. ప్రజాసేవ చేసే ఉద్దేశ్యంతో తాను కాంగ్రెస్లో చేరినట్లు ఆయన తెలిపారు. శ్రీహరి సేవలను ఉప ఎన్నికల్లోనూ, ఆ తర్వాత పార్టీ బలోపేతానికి వాడుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు.
Comments
Story first published: Sunday, November 12, 2006, 23:53 [IST]