వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్య చివరిచూపు దక్కక ఇద్దరిని హత్య చేసిన వ్యక్తి

By Super Admin
|
Google Oneindia TeluguNews

అనంతపురం: మరణించిన భార్యను చివరిచూపు చూడనీయలేదనే ఆగ్రహంతో ఒక వ్యక్తి ఇద్దరిని నరికి చంపాడు. మరొకరిని గాయపరిచాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలో జరిగింది. రామాంజనేయులు, నాగవేణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ పెళ్లికి నాగవేణి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. రామాంజనేయులు, నాగవేణి గొడవపడ్డారు. దీంతో నాగవేణి 15 రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది.

పుట్టింటిలో నాగవేణి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని మరణించింది. ఆమె మృతదేహానికి యాడికి స్మశానవాటికలో అంత్యక్రియలు జరిపారు. ఈ సమయంలో స్మశానవాటికకు చేరుకున్న రామాంజనేయులు తన భార్యను కనీసం చివరిసారిగానైనా చూడనీయలేదని ఆగ్రహం చెందారు. ఆ ఆగ్రహంతో అతను నాగవేణి అమ్మమ్మ, తాతయ్య, పెద్దమ్మలను వేటకొడవలితో నరికాడు. దీంతో నాగవేణి అమ్మమ్మ, తాతయ్య మరణించారు. పెద్దమ్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వారిని హత్య చేసిన తర్వాత రామాంజనేయులు పోలీసులకు లొంగిపోయాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X