వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణపై కాంగ్రెస్ అబద్ధాలు: విద్యాసాగరరావు
కరీంనగర్: కరీంనగర్ లోక్సభ ఎన్నికలో గెలవడానికి తెలంగాణపై కాంగ్రెస్ అబద్ధాలు ఆడుతోందని భారతీయ జనతా పార్టీ నాయకుడు, కరీంనగర్ బిజెపి అభ్యర్థి సిహెచ్. విద్యాసాగరరావు అన్నారు. తెలంగాణపై కాంగ్రెస్కు స్పష్టత లేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. ఎన్నిక నిష్పాక్షికంగా జరిగితే గెలుపు తనదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కరీంనగర్ లోక్సభ ఉప ఎన్నిక నిష్పాక్షికంగా జరుగుతుందనే నమ్మకం తనకు లేదని ఆయన అన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నియమావళిని యధేచ్ఛగా ఉల్లంఘిస్తోందని ఆయన విమర్శించారు. ఎన్నికల ప్రజాస్వామ్యబద్దంగా జరుగుతుందని నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ఎన్నికల కమీషన్పై వుందని ఆయన అన్నారు.
Comments
Story first published: Monday, November 13, 2006, 23:53 [IST]