వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరంగల్‌ జిల్లాలో బాలికపై అత్యాచారం, ఆపై హత్య

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌: వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వికలాంగురాలైన బాలికకు ఆశ చూపి ఆమెపై అత్యాచారం జరిపి ఆమెను హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘోర సంఘటన వరంగల్‌ జిల్లాలోని గట్ల కానిపర్తి గ్రామంలో జరిగింది. ఈ గ్రామంలోని రజిత అనే బాలికను పింఛను ఇప్పిస్తానని అదే గ్రామానికి వికలాంగుల సంక్షేమం సంఘం అధ్యక్షుడు రాజమొగలి తన వెంట తీసికెళ్లి తన మిత్రులతో కలిసి అత్యాచారం జరిపి హత్య చేశాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

రాజమొగిలి వెంట వెళ్లిన రజిత ఒక వ్యవసాయ బావిలో తేలింది. దీంతో ఆగ్రహం చెందిన గ్రామస్థులు రాజమొగిలి ఇంటిని, ఆస్తులను ధ్వంసం చేశారు. రజిత ఒంటికి ఉన్న నగలను కూడా కొల్లగొట్టారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. రాజమొగిలి వెంట వెళ్లిన రజిత కోసం తాను వెళ్తే ఆమె కనిపించలేదని, ఇంటికి తిరిగి వస్తే రాలేదని భార్య చెప్పిందని రజిత తండ్రి చెబుతున్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X