వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మర్చిపోలేని రోజు: రామసుబ్బారెడ్డి భార్య ఇందిర

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తప్పు చేయకున్నా తన భర్త రెండేళ్ల శిక్ష అనుభవించారని, ఈ కాలంలో తాము అనుభవించిన హింస చెప్పలేనిదని షాద్‌నగర్‌ జంట హత్యల కేసులో నిర్దోషిగా విడుదలైన తెలుగుదేశం పార్టీ నాయకుడు రామసుబ్బారెడ్డి భార్య ఇందిర అన్నారు. చర్లపల్లి జైలు నుంచి రామసుబ్బారెడ్డి మంగళవారం నాడు విడుదలయ్యే సమయంలో ఆమె తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.

తన భర్త విడుదల కావడం ఎంతో ఆనందాన్ని కలుగజేస్తున్నదని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు. ఇది తనకు జీవితంలో మర్చిపోలేని రోజు అని ఆమె అన్నారు. ఎట్టకేలకు న్యాయం గెలిచిందని ఆమె అన్నారు. హైకోర్టులో తమకు న్యాయం జరుగుతుందని అనుకున్నామని, అనుకున్నట్లే జరిగిందని, అందుకు తనకు ఎంతో ఆనందంగా వున్నదని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X