వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజన్న అరెస్టు చెల్లదని హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్: తన అరెస్టు చెల్లదంటూ సిపిఐ (యంయల్) జనశక్తి అగ్రనేత కూర రాజన్న వేసిన పిటిషన్ను హైకోర్టు శుక్రవారంనాడు విచారణకు స్వీకరించింది. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. వారంటు లేకుండా తనను అరెస్టు చేయడమే కాకుండా 24 గంటల్లోగా కోర్టులో హాజరు పరచలేదని, అందువల్ల రాజన్న అరెస్టు చెల్లదని రాజన్న తరఫున పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది అన్నారు.
కూర రాజన్నను పోలీసులు ఉత్తరప్రదేశ్లో అరెస్టు చేశారు. పలువురు పౌరహక్కుల నాయకులు డిమాండ్ చేయడంతో ఎట్టకేలకు పోలీసులు ఆయనను కోర్టులో హాజరు పరిచారు.
Comments
Story first published: Friday, November 17, 2006, 23:53 [IST]