వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖ తీరానికి ఆరుగురు శ్రీలంక జాలర్లు

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: శ్రీలంక జాలర్లను ఆరుగురిని విశాఖపట్పం తీర గస్తీదళం రక్షించింది. 13 రోజుల క్రితం ట్రింకోమలి తీరం నుంచి ఈ నెల 4వ తేదీన బయలుదేరిన శ్రీలంక జాలర్లు ఆరుగురు పడవ ఇంజన్‌ చెడిపోవడంతో సముద్రంలో చిక్కుకుపోయారు. దీంతో ఈ విషయాన్ని శ్రీలంక ప్రభుత్వం భారత నావికాదళానికి తెలియజేసింది.

ప్రభుత్వ ఆదేశాలతో విశాఖపట్నం తీర గస్తీ దళం రంగంలోకి దిగింది. ఈ దళం బోట్‌లో బయలుదేరి అన్వేషించి వారిని గుర్తించి విశాఖపట్నం తీరానికి చేర్చింది. శ్రీలంక ప్రభుత్వానికి సమాచారం అందించిన తర్వాత వీరిని పంపిస్తామని తీర గస్తీ దళంవారు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X