వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విశాఖ తీరానికి ఆరుగురు శ్రీలంక జాలర్లు
విశాఖపట్నం: శ్రీలంక జాలర్లను ఆరుగురిని విశాఖపట్పం తీర గస్తీదళం రక్షించింది. 13 రోజుల క్రితం ట్రింకోమలి తీరం నుంచి ఈ నెల 4వ తేదీన బయలుదేరిన శ్రీలంక జాలర్లు ఆరుగురు పడవ ఇంజన్ చెడిపోవడంతో సముద్రంలో చిక్కుకుపోయారు. దీంతో ఈ విషయాన్ని శ్రీలంక ప్రభుత్వం భారత నావికాదళానికి తెలియజేసింది.
ప్రభుత్వ ఆదేశాలతో విశాఖపట్నం తీర గస్తీ దళం రంగంలోకి దిగింది. ఈ దళం బోట్లో బయలుదేరి అన్వేషించి వారిని గుర్తించి విశాఖపట్నం తీరానికి చేర్చింది. శ్రీలంక ప్రభుత్వానికి సమాచారం అందించిన తర్వాత వీరిని పంపిస్తామని తీర గస్తీ దళంవారు చెబుతున్నారు.
Comments
Story first published: Friday, November 17, 2006, 23:53 [IST]