వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థిని గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత సైనైడ్ మింగి ఆత్మహత్య చేసుకుంది. ఢిల్లీకి చెందిన హస్ను భావన అనే విద్యార్థిని హాస్టల్లో వుంటూ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో యంయస్పీ మైక్రో బయోలజీ మొదటి సంవత్సరం చదువుతోంది.
ఆమె గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత రెండు గంటల ప్రాంతంలో సైనైడ్ మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు ఆ మాత్రం ఎక్కడి నుంచి వచ్చాయనేది తెలియడం లేదు. వివరాలు వెల్లడించడానికి యూనివర్శిటీ అధికారులు నిరాకరిస్తున్నారు. ఆమె ఆత్మహత్యకు ర్యాగింగ్ కారణం కావచ్చునని కూడా అనుమానిస్తున్నారు.
Comments
Story first published: Friday, November 17, 2006, 23:53 [IST]