తాడిపత్రిలో మళ్లీ ఉద్రిక్తత: పోలీసుల లాఠీచార్జి
అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రిలో శుక్రవారం మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జి చేశారు. రోడ్డు విస్తరణ కోసం ఒక ప్రార్థనామందిరాన్ని కూల్చివేసే సమయంలో బుధవారం పెద్దయెత్తున ఆందోళన చెలరేగింది. పరస్పరం బాంబు దాడులు జరిగాయి. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. అయితే పరిస్థితిని పోలీసులు పరిస్థితిని అదుపులోకి తేగలిగారు. రాత్రంతా ఆ ప్రదేశం నుంచి ఆందోళనకారులను ఖాళీ చేయించడంలో పోలీసులు సఫలమయ్యారు. అయితే శుక్రవారం ఉదయం అకస్మాత్తుగా మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
ప్రత్యేక ప్రార్థనల కోసం ఒక వర్గంవారు శుక్రవారంనాడు పెద్ద యెత్తున గుమిగూడారు. దాదాపు 300 మంది గుమికూడి వుంటారని అంచనా. తాడిపత్రిలో 144వ సెక్షన్ ఉన్నందున వీధుల్లో గుమికూడదని పోలీసులు ఎంతగా చెప్పినా వినిపించుకోలేదు. ఈ సమయంలో పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో అకస్మాత్తుగా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.