వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కర్నూలు జిల్లాలో పాలమూరు కూలీల దుర్మరణం
కర్నూలు: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపంలోని గూబగుండం మెట్ట గ్రామం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో పది మంది గాయపడ్డారు. వీరు ప్రయాణిస్తున్న మినీ లారీ చింత చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. వీరంతా మహబూబ్నగర్ జిల్లాలోని వనపర్తి చుట్టపక్కల నాలుగు గ్రామాలకు చెందిన వలసకూలీలు.
మహబూబ్నగర్ జిల్లాలోని వనపర్తి ప్రాంతంలోని గ్రామాలకు చెందిన 29 మంది వలస కూలీలు మినీ లారీలో ప్రయాణిస్తున్నారు. నెల్లూరు కాల్వ పనుల కోసం వెళ్తుండగా ప్రమాదం వారిని కాటేసింది. నలుగురు అక్కడికక్కడే మరణించగా ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మిగతావారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Comments
Story first published: Tuesday, November 21, 2006, 23:53 [IST]