రూ. 42 లక్షలు గోల్మాల్: 5గురిపై క్రిమినల్ కేసులు
సంగారెడ్డి: సింగూరు ప్రాజెక్టు భూసేకరణ నష్టపరిహారం చెల్లింపు వ్యవహారంలో 42 లక్షల రూపాయల మేరకు గోల్మాల్ జరిగినట్లు బయటపడింది. ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్, సూపరింటిండెంట్తో పాటు మరో ముగ్గురిని సస్పెండ్ చేశారు. వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసినట్లు మెదక్ జిల్లా కలెక్టర్ చెప్పారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలకు మంచినీరు అందించే సింగూరు ప్రాజెక్టుకు భూసేకరణ విషయంలో నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించే విషయంలో గోల్మాల్ జరిగినట్లు తేలింది.
గోల్మాల్కు పాల్పడిన రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ మల్లయ్య భూసేకరణకు సంబంధించి ప్రత్యేకాధికారిగా నియమితులయ్యారు. ఆయన ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీన రిటైర్ అయ్యారు. రిటైర్ కావడానికి నాలుగు రోజుల ముందు 26వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు భూసేకరణకు సంబంధించి వార్తాపత్రికలకు వాణిజ్యప్రకటనలు ఇచ్చామని గోల్మాల్కు పాల్పడ్డారు. ఆయనకు ఈ వ్యవహారంలో సుదర్శన్, నయీమ్, సత్తార్లతో పాటు మరో ఉద్యోగి సహకరించినట్లు తేలింది.