వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కృష్ణా నీళ్లపై నివేదికలకు ట్రిబ్యులన్ ఆదేశం
న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాల విడుదల, వాడకాలపై రెండు నెలలలోగా నివేదికలు సమర్పించాలని కృష్ణా ట్రిబ్యునల్ బుధవారంనాడు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలను ఈ మేరకు ట్రిబ్యునల్ ఆదేశించింది. కృష్ణా జలాల వివాదానికి సంబంధించి ట్రిబ్యునల్ విచారణాంశాలను ఖరారు చేసింది.
గత 30 యేళ్లలో కృష్ణా నదీ జలాల విడుదల, వాడకానికి సంబంధించి రోజువారీ వివరాలతో నివేదికలు సమర్పించాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. ఒక వేళ ఆ వివరాలు లేకపోతే ఎందుకు లేవో కూడా చెప్పాలని కూడా ఆదేశించింది. విచారణను వచ్చే నెల 13వ తేదీకి వాయిదా వేసింది. కృష్ణా నదీ జలాల విషయంలో 30 విచారణాంశాలను ట్రిబ్యునల్ గుర్తించింది.
Comments
Story first published: Monday, November 27, 2006, 23:53 [IST]