వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సిరిసిల్ల చేనేత కార్మికులపై ఇప్పుడు ప్రేమ: దేవేందర్
కరీంనగర్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి ఇన్నాళ్లకు కరీంనగర్ జిల్లా సిరిసిల్ల చేనేత కార్మికులు గుర్తుకు వచ్చారా? అని తెలుగుదేశం పార్టీ నాయకుడు తూళ్ల దేవేందర్ గౌడ్ ప్రశ్నించారు. ఆదివారంనాడు కరీంనగర్లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కరీంనగర్ లోక్సభ ఉప ఎన్నిక రావడంతో ముఖ్యమంత్రి చేనేత కార్మికులపై ప్రేమ చూపుతున్నారని ఆయన అన్నారు.
తన కుర్చీకి ఎసరు వస్తుందనే భయంతో ముఖ్యమంత్రి కరీంనగర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సిరిసిల్లలో చేనేత కార్మికులు మరణించారా, నాకు తెలియదే అన్న పద్ధతిలో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. డిసెంబర్ నాల్గవ తేదీ తర్వాత కాంగ్రెస్ నాయకులెవరూ ప్రజలకు దొరకరని ఆయన అన్నారు.
Comments
Story first published: Thursday, November 30, 2006, 23:53 [IST]