వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కడప కోసం తెలంగాణకు అన్యాయం: టిడిపి
కరీంనగర్: కడప జిల్లాకు నీటిని తరలించడానికి నీటి ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని తెలుగుదేశం నాయకుడు టి. దేవేందర్ గౌడ్ విమర్శించారు. ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగనంత అన్యాయం తెలంగాణకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
రాష్ట్రంలోని ప్రాజెక్టుల నాణ్యతను పరీక్షించడానికి రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీని వేస్తామని, తద్వారా ప్రభుత్వ అస్తవ్యస్త విధానాన్ని బయటపెడుతామని ఆయన చెప్పారు. ప్రాజెక్టులకు డిజైన్ ఉందా, ఉంటే దానికి ఆమోదం ఉందా అనే విషయాలను తేలుస్తామని ఆయన అన్నారు. ప్రభుత్వ దుర్మార్గాలను ఆధారాలతో సహా బయట పెడతామని ఆయన అన్నారు.
Comments
Story first published: Wednesday, September 12, 2007, 23:53 [IST]