వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కడప కోసం తెలంగాణకు అన్యాయం: టిడిపి

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్: కడప జిల్లాకు నీటిని తరలించడానికి నీటి ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని తెలుగుదేశం నాయకుడు టి. దేవేందర్ గౌడ్ విమర్శించారు. ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగనంత అన్యాయం తెలంగాణకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

రాష్ట్రంలోని ప్రాజెక్టుల నాణ్యతను పరీక్షించడానికి రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీని వేస్తామని, తద్వారా ప్రభుత్వ అస్తవ్యస్త విధానాన్ని బయటపెడుతామని ఆయన చెప్పారు. ప్రాజెక్టులకు డిజైన్ ఉందా, ఉంటే దానికి ఆమోదం ఉందా అనే విషయాలను తేలుస్తామని ఆయన అన్నారు. ప్రభుత్వ దుర్మార్గాలను ఆధారాలతో సహా బయట పెడతామని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X