వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రీతిని పావుగా వాడుకుంటున్నారు: విలాసిని
హైదరాబాద్: తన భర్త ప్రశాంత్ రెడ్డి హత్య కేసులో ప్రీతిని పావుగా వాడుకుంటున్నారని విలాసిని ఆరోపిస్తున్నారు. ప్రీతిని బయటకు తెచ్చి వెంకట్ తండ్రి, పిసిసి మాజీ అధ్యక్షుడు కె. కేశవరావు నాటకం ఆడుతున్నారని ఆమె బుధవారం ఒక ప్రైవేట్ టీవీ ఛానెల్ ప్రతినిధితో అన్నారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె అన్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తన భర్త ప్రశాంత్ రెడ్డితో పాటు వెంకట్, ప్రీతి భాగస్వాములని ఆమె అన్నారు. ప్రశాంత్ రెడ్డిని తమకు అడ్డు తొలగించుకోవడానికి వారిద్దరు కలిసి ఇంటికి పిలిపించారని ఆమె చెప్పారు. కేసును పక్క దోవ పట్టిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు.
Comments
Story first published: Wednesday, September 12, 2007, 23:53 [IST]