వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఆర్సీసివన్నీ అబద్ధాలే: మంత్రి జీవన్ రెడ్డి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్ తెలంగాణ ప్రాంతీయ సమన్వయ కమిటీ (టీఆర్సీసి) నాయకులు చెప్పే మాటల్లో నిజం లేదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి టి. జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అమ్మిన భూముల ద్వారా వస్తున్న దాని రెండింతలు ఎక్కువగా ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఖర్చు చేస్తోందని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా జరగనంత అభివృద్ధి ఇప్పుడు జరుగుతోందని ఆయన అన్నారు. తెలంగాణకు కేటాయిస్తున్న నిధులను చూసి ఇతర ప్రాంతాలవారు ఈర్ష్యపడుతున్నారని ఆయన అన్నారు.

పార్టీ నాయకత్వం నుంచి షోకాజ్ నోటీసును అందుకున్న మర్రి శశిధర్ రెడ్డి ఇంట్లో టీర్సీసీ నేతలు సమావేశమయ్యారు. ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేస్తే తప్ప వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవని వారు చెప్పారు. పిసిసి అధ్యక్ష పదవికి వి. హనుమంతరావును బలపరచాలని వారు నిర్ణయించుకున్నారు. తెలంగాణకు సంబంధించి వాస్తవాలను తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వినిపిస్తామని వారు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X