వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ ప్రభుత్వానికి సిగ్గు లేదు: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews


హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సిగ్గు, భయం లేకుండా అందరిపై ఒత్తిడి తెస్తోందని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పేషీ అవినీతిలో పాలు పంచుకున్నారని విజిలెన్స్ మాజీ కమిషనర్ సమాల్ అరోపిస్తే ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. విమర్శలు చేసినవారిపై ముఖ్యమంత్రి ఎదురుదాడి చేస్తున్నారని ఆయన అన్నారు. సమాల్ నివేదిక ప్రభుత్వానికి షాక్ అని ఆయన అన్నారు. అవినీతి అధికారులను ప్రభుత్వం అందలమెక్కించిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ అవినీతిని సాక్ష్యాధారాలతో బయటపెట్టామని ఆయన చెప్పారు.

అనుకున్న అవినీతి చేస్తామనే ఉద్దేశంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. సమాల్ నివేదికలోని వివిధ ఆరోపణలను ఆయన చదివి వినిపించారు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అవినీతిని ఎత్తిచూపే సమాల్ నివేదికను ప్రధానికి, రాష్ట్రపతికి తెలియజేస్తామని ఆయన చెప్పారు. సమాల్ నివేదికలోని అంశాలను కరపత్రాలు, పుస్తకాల ద్వారా ప్రజల్లోకి తీసికెళ్తామని ఆయన చెప్పారు. ప్రాజెక్టుల్లో అవినీతికి అంతం లేకుండా ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం కాంట్రాక్టర్ల కొమ్ము కాస్తోందని ఆయన అన్నారు. విజిలెన్స్ విచారణలో ఉన్న, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు ప్రమోషన్లు ఇచ్చారని ఆయన విమర్శించారు. హైదరాబాదులో ఫ్లై ఓవర్ కూలితే కాంట్రాక్టర్ పై ప్రేమ చూపారే గాని చర్య తీసుకోలేదని ఆయన విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X