వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబే సమాల్ ను ఉసిగొల్పి ఉంటారు: వైయస్

By Staff
|
Google Oneindia TeluguNews


హైదరాబాద్: విజిలెన్స్ మాజీ కమీషనర్ సమాల్ ను తన మీదికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే ఉసిగొల్పి ఉండవచ్చునని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. గతంలో కె.ఎ. పాల్ ను తన మీదికి ఉసిగొల్పింది చంద్రబాబేనని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. చంద్రబాబుపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన కార్యాలయంలోని జనత్ హుస్సేన్, భానులు మచ్చ లేనివారని, వారిపై కూడా సమాల్ నిరాధారమైన ఆరోపణలు చేశారని ఆయన అన్నారు.

సమాల్ పత్రికా ప్రకటన మాత్రమే చేశారని, అది ఉపద్రవమేమీ కాదని ఆయన అన్నారు. తాను నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నానని ప్రతిపక్షాలు అంటున్నాయని, పత్రికా ప్రకటనను చూసి తగిన చర్యలు తీసుకోవడానికి సమయం పడుతుందని ఆయన అన్నారు. తనపై ఆరోపణలు వచ్చినప్పుడు స్పందించే అధికారం హోంమంత్రి జానా రెడ్డికి ఉంటుందని ఆయన అన్నారు. సమాల్ తనతో చెప్పి ఉంటే చర్యలు తీసుకుని ఉండేవాడినని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X