వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెంకట్ ను సిఐడి కస్టడీకి అప్పగించిన కోర్టు

By Staff
|
Google Oneindia TeluguNews


హైదరాబాద్: రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రశాంత్ రెడ్డి హత్య కేసులో పిసిసి మాజీ అధ్యక్షుడు కె. కేశవరావు కుమారుడు వెంకట్ ను ఈ నెల 21వ తేదీ వరకు సిఐడి పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 8న వెంకట్ ఇంట్లో జరిగిన కాల్పుల్లో ప్రశాంత్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి మరణించిన విషయం తెలిసిందే.

ఈ సంఘటనకు వెంకట్ బాధ్యూడని పేర్కొంటూ, ప్రశాంత్ రెడ్డి కుటుంబసభ్యులు జూబిలీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో వెంకట్ ను అరెస్టు చేసి కోర్టు ముందు ఉంచగా న్యాయస్ధానం రిమాండ్ కు ఆదేశించింది. ఇలా ఉండగా కేసును ప్రభుత్వం సిఐడికి అప్పగించింది. నిందితుడిని విచారించేందుకు పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వవలసిందిగా సిఐడి న్యాయస్ధానాన్ని కోరింది. దీంతో ఐదు రోజుల పాటు వెంకట్ ను సిఐడి కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారి చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X