వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
"వర్షం వలన మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.లక్ష నగదు"
హైదరాబాద్ భారీ వర్షాల భారిన పడి మరణించిన కుటుంబాల వారికి లక్షరూపాయల చెప్పున నగదు సాయమందించడానికి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. గత కొద్దిరోజులుగు రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల వలన ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితిని రాష్ట్ర ముఖ్యమంత్రి బుధవారం జరిగిన అత్యవసర సమీక్షలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. వర్షం వలన గోడలు కూలి, పిడుగులు పడి మరణించిన వారి కుటుంబాలకు నగదు సాయమందించడానికి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్టు సమావేశానంతరం రెవెన్యూ శాఖా మంత్రి మీడియాకు చెప్పారు.
Comments
Story first published: Wednesday, September 19, 2007, 23:53 [IST]