వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సమాల్ నివేదికపై చర్చకు అసెంబ్లీని సమావేశపర్చండి: టిడిపి
హైదరాబాద్: విజిలెన్స్ మాజీ కమీషనర్ రామచంద్ర సమాల్ నివేదకపై చర్చించేందుకు వెంటనే అసెంబ్లీని తక్షణం సమావేశపరచాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం ఉపనేత టి.దేవేందర్ గౌడ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ విజిలెన్స్ కమీషన్ ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోకపోవడం శోచనీయమని అన్నారు. నివేదికపై ప్రభుత్వం చర్యతీసుకోని పక్షంలో ఆ నివేదికను అసెంభ్లీ లో ప్రవేశపెట్టాల్సిన భాద్యత ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. నివేదికలో ఇంత సీరియస్ అంశాలు ఉండగా ప్రభుత్వం దానిని పట్టించుకోకపోవడం సరికాదని ఆయన విమర్శించారు.
Comments
Story first published: Wednesday, September 19, 2007, 23:53 [IST]