వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హుస్సేన్ సాగర్ కు తరలివస్తున్న గణనాథులు

By Staff
|
Google Oneindia TeluguNews


Ganesh Immersion హైదరాబాద్: హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో వినాయక నిమజ్జన కార్యక్రమం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. జంటనగరాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వినాయకుడి విగ్రహాలు హుస్సేన్ సాగరులో నిమజ్జనం కోసం ఊరేగింపుగా బయలుదేరాయి. ఖైరతాబాదులోని అతి పెద్ద వినాయక విగ్రహం మంగళవారం రాత్రి నిమజ్జనం కోసం బయలుదేరుతుంది. హైదరాబాదులోని లాల్ బాగు నుంచి వినాయక ఊరేగింపు ఉదయం ప్రారంభమైంది. నిమజ్జన కార్యక్రమాన్ని ట్యాంక్ బండు వద్ద గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ శర్మ పర్యవేక్షిస్తున్నారు. గణనాధుని ప్రధాన ఊరేగింపు మొజాంజాహీ మార్కెట్ నుంచి సాగుతుంది.

నిమజ్జన కార్యక్రమం సజావుగా సాగడానికి మునుపెన్నడు లేనంతగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 23 వేల సిబ్బందిని భద్రత నిమిత్తం నియోగించారు. నిమజ్జనం కోసం 31 క్రేనులను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు 8 వేల వినాయక విగ్రహాలు ఏర్పాటయ్యాయి. వీటి నిమజ్జనం హైదరాబాదు చుట్టు పక్కల గల 16 చెరువుల్లో జరుగుతుంది. దిల్ షుక్ నగరులోని భారీ వినాయక విగ్రహం నిమజ్జనం బుధవారంనాడు సరూర్ నగర్ చెరువులో జరుగుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X