వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధికారంలోకి వస్తే రైతుల రుణాలు మాఫీ: చంద్రబాబు

By Staff
|
Google Oneindia TeluguNews


హైదరాబాద్: ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉండగానే రాజకీయ పార్టీలు వరాల వర్షం కురిపిస్తున్నాయి. ఈ వరాల వర్షం కురిపించడంలో తెలుగుదేశం పార్టీ ముందంజలో కొనసాగుతోంది. తాము అధికారంలోకి వస్తే రైతుల రుణాలను మాఫీ చేస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వరాల వర్షం కురిపించారు. తాము అధికారంలోకి వస్తే పేదలకు ఇళ్ల స్థలాలను ఇస్తామన్నారు.

కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడంతో విదేశీయులు హైదరాబాద్ రావాలంటేనే భయపడుతున్నారని చంద్రబాబు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.42 వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చింది కానీ అవి పేదలకు చేరడంలేదని ఆయన ధ్వజమెత్తారు. ప్రస్తుతం అమలవుతున్న ఆర్థిక సంస్కరణలు ఫలవంతం కావడంలేదు కాబట్టి వాటిని పునఁపరిశీలించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ధనవంతులు మరింత ధనవంతులుగానూ, పేదలు మరింత పేదలుగానూ తయారవడమే కాకుండా సమాజంలో అంతరాలు పెరుగుతున్నాయని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X